అధికార పక్ష నేతల పట్ల టీడీపీ ఎమ్మెల్సీలు వ్యవహరిస్తున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సంఖ్యాబలం చూసుకుని బిల్లులు అడ్డుకుంటున్నారని అన్నారు. సీఆర్డీయే రద్దు బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులు అడ్డుకునేందుకు పక్కా ప్లాన్ తో వచ్చారని టీడీపీ ఎమ్మెల్సీలపై విమర్శలు చేశారు. బిల్లులపై ఏవైనా అభ్యంతరాలుంటే ఓటింగ్ జరుపుకోవచ్చని హితవు పలికారు.
సభలో జరుగుతున్న వ్యవహారాలను వీడియోలు, ఫొటోలు తీయొద్దని గతంలోనూ నారా లోకేశ్ కు చెప్పామని, కానీ మరోసారి అదే పని చేశారని మండిపడ్డారు. ఇదేమని ప్రశ్నిస్తే మంత్రులపై దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లే దౌర్జన్యం చేసి, మేం చేశామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
జగన్ ముఖ్యమంత్రి అయితే ఏపీకి మంచి రోజులు: మోహన్ బాబు