భారత్, శ్రీలంక మధ్య ముంబయిలోని వాంఖడే వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్కి గురైనట్లు.. శ్రీలంక అప్పటి క్రీడల మంత్రి మహీందానంద అలుత్గమాగే సంచలన ఆరోపణలు చేశాడు. ఆ ఫైనల్ మ్యాచ్పై తాజాగా ఓ ఇంటర్వ్యూ మహీందానంద అలుత్గమాగే మాట్లాడుతూ “నేను ఈరోజు చెప్తున్నా.. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్లో శ్రీలంక అమ్ముడుపోయింది. నేను అప్పట్లో స్పోర్ట్స్ మినిస్టర్.. అయినప్పటికీ నమ్మక తప్పడం లేదు. 2011లో వన్డే ప్రపంచకప్ని శ్రీలంక గెలిచి ఉండేది. కానీ.. ఆ మ్యాచ్ని మేము అమ్మేశాం. నేను ఏ ఆటగాడితోనూ ప్రస్తుతం కాంటాక్ట్లో లేను. కానీ.. టీమ్లోని కొంతమంది ఫిక్సింగ్కి సహకరించారు” అని సంచలన ఆరోపణలు చేశాడు. ఆ మ్యాచ్లో టాస్ వద్దే కెప్టెన్లు మహేంద్రసింగ్ ధోనీ, కుమార సంగక్కర మధ్య కన్ప్యూజన్ కారణంగా రెండు సార్లు టాస్ వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత శ్రీలంక తుది జట్టు ఎంపికపైనా ఆ దేశ మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ అప్పట్లో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. మ్యాచ్లో ఫిక్సింగ్ జరిగినట్లు ఆరోపణలు గుప్పించాడు. తాజాగా ఆ దేశ క్రీడల మంత్రి స్వయంగా ఆరోపణలు చేయడంతో ఫైనల్ మ్యాచ్పై అందరిలోనూ సందేహాలు మొదలయ్యాయి. ఆ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు.. మహేల జయవర్దనె (103 నాటౌట్: 88 బంతుల్లో 13×4) శతకం బాదడంతో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని భారత్ జట్టు.. గౌతమ్ గంభీర్ (97: 122 బంతుల్లో 9×4), మహేంద్రసింగ్ ధోని (91 నాటౌట్: 79 బంతుల్లో 8×4, 2×6) బాధ్యతాయుత ఇన్నింగ్స్లు ఆడటంతో 48.2 ఓవర్లలోనే 277/4తో ఛేదించింది. 1983లో తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత్ జట్టు.. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ 2011లో వరల్డ్కప్ గెలిచిన విషయం తెలిసిందే.
previous post
next post