telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

పాక్ విమానం కూలిన ఘటనలో.. 97కు చేరిన మృతుల సంఖ్య

flight crash punjob

పాకిస్థాన్‌లోని కరాచీలో నిన్న విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 97కు చేరింది. దుర్ఘటన జరిగిన సమయంలో విమానంలో 91 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా, 97 మంది మరణించారు. ప్రమాదం నుంచి బయటపడిన ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

విమానం జనావాస ప్రాంతాల్లో కుప్పకూలడంతో స్థానికుల్లో చాలామంది గాయపడ్డారు. వారందరినీ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం సందర్భంగా పురుషులు ప్రార్థనల కోసం మసీదులకు వెళ్లడంతో ఇంటి పట్టున ఉన్న మహిళలు ఎక్కువ మంది గాయపడ్డారు. మృతుల్లో చాలామంది ప్రయాణికులు సీటు బెల్టు ధరించే ఉన్నారని అధికారులు తెలిపారు.

Related posts