జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ శుక్రవారం భీమవరంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. కుల, మతాల పేరుతో రాజకీయాలు నడుస్తున్న ప్రస్తుత తరుణంలో పవన్, ఆ పార్టీలో ఇటీవలే చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సహా పలువురు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాల్లో కులమత ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడ్డారు.
పత్రాల్లో ఎక్కడా కులం గురించి కానీ, మతం గురించి కానీ ప్రస్తావించలేదు. అయితే నిబంధనల ప్రకారం అన్ని వివరాలు నామినేషన్ పాత్రలలో పొందు పరచాలి. అలా, ఒకవేళ వివరాలు సరిగా లేకపోతే ఎన్నికల అధికారి వీరి నామినేషన్ ను తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పవన్, లక్ష్మీనారాయణ నామినేషన్ లు తిరస్కరించబడితే పరిస్థితులు ఏమిటనేది నామినేషన్ ఆఖరు తేదీన తెలుస్తుంది.
విభజన చట్టంలోని హామీలకు బడ్జెట్లో ప్రతిపాదనలు లేవు: ఎంపీ ప్రభాకర్ రెడ్డి