telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కోదండరాంకు మద్దతు ఇవ్వాలని టీజేఎస్ లేఖలు

Kodandaram

తెలంగాణలో త్వరలో పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధినేత ప్రొఫెసర్ కోదండరాం  బరిలోకి దిగారు. ఆయన గెలుపుకు మద్దతివ్వాలని (టీజేఎస్) ప్రతిపక్ష పార్టీలను కోరింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కోదండరాం గెలుపును నిరుద్యోగులు, యువత కోరుకుంటున్నారని టీజేఎస్ తెలిపింది.

ప్రస్తుత పరిస్థితుల్లో శాసన మండలిలో వారి తరపున గొంతెత్తేందుకు కోదండరాం లాంటి నాయకుడు అవసరమని టీజేఎస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు కోదండరాంకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమొక్రసీ పార్టీలకు టీజేఎస్ లేఖలు రాసింది.

Related posts