వైఎస్ఆర్ వాహనమిత్ర మూడో ఏడాది ఆర్ధికసాయం ఇవాళ విడుదల కానుంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. ఈ పథకం వల్ల 2,48,468 మందికి జరుగనున్న లబ్ది చేకూరనుంది. ఈ పథకం కింద 248.47 కోట్లు వెచ్చించనున్న ప్రభుత్వం..ఒక్కో లబ్ధిదారుని ఖాతాలో రూ. 10,000 చొప్పున జమ చేయనుంది. ఆటో, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందించనుంది. ఈ పథకం ద్వారా ఏటా వారికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేస్తూ.. డబ్బును వాహనాల ఫిట్నెస్, బీమా, మరమ్మతుల కోసం వినియోగించుకోవాలని సూచిస్తుంది సర్కార్. ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ దరఖాస్తుల ప్రక్రియకు అవకాశం కల్పించగా.. దరఖాస్తు ప్రక్రియలో గ్రామవాలంటీర్లు సాయం చేస్తున్నారు.
previous post
next post
రాజధానిలో రియల్ రంగం పడిపోయింది: చంద్రబాబు