telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీచర్ల బదిలీలకు సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్

cm jagan ycp

ఎట్టకేలకు  ఉపాధ్యాయుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం పచ్చా జెండా ఊపింది. బదిలీల ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌ పద్ధతిలోనే నిర్వహించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. టెన్త్‌ పరీక్షల తర్వాత బదిలీలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా బదిలీలు చేపట్టాలని సూచించారు.

గిరిజన ప్రాంతాల్లో కూడా టీచర్ల కొరత లేకుండా చూడాలని జగన్‌ ఆదేశించారు. క్యాంపు ఆఫీసులో నాడు–నేడుపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. స్కూళ్లలో ఏర్పాటు చేయనున్న సదుపాయాలను పరిశీలించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts