telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

రోజుకు రూ.33 ఇన్వెస్ట్ చేసి… రూ.44 లక్షలు పొందండి… ఎలాగంటే ?

employee offering money to his lead

చిన్న మొత్తంలో డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి పెద్ద మొత్తంగా మార్చుకోవడం ఎలాగో తెలియక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. అయితే సంపద సృష్టించేందుకు ఒక ఆప్షన్ అందబాటులో ఉంది. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ స్కీమ్స్ వంటివి పాపులర్ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలుగా కొనసాగుతున్నాయి. అలాగే మ్యూచువల్ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్లకు కూడా ఆదరణ పెరుగుతూ వస్తోంది. ఇన్వెస్టర్లు దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్ల ప్రాధాన్యాన్ని గుర్తించడం ఇందుకు కారణం. దీర్ఘకాలంలో కాంపౌండింగ్ ప్రయోజనం వల్ల అధిక రాబడిని పొందొచ్చు. ఎల్‌జే బిజినెస్ స్కూల్ మ్యూచువల్ ఫండ్ నిపుణుడు పూనమ్ రుంగ్టా మాట్లాడుతూ.. ‘మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు రూ.1,000 (రోజుకు దాదాపు రూ.33) ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇలా మీరు పదేళ్లపాటు ఇన్వెస్ట్ చేశారనుకోండి. అప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం రూ.1,20,000 అవుతుంది. దీనిపై మీకు రూ.1,82,946 రాబడి పొందొచ్చు. ఇలా మీరు మరో పదేళ్ల ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగిస్తే.. అప్పుడు మీకు మెచ్యూరిటీ సమయంలో రూ.3.94 లక్షలు లభిస్తాయి. ఇక్కడ వార్షిక రాబడిని 8 శాతంగా పరిగణలోకి తీసుకున్నాం’ అని వివరించారు. క్రమంగా తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం వల్ల పెట్టుబడి పెరుగుతూ వస్తుందని ఆయన తెలిపారు. ‘అలాగే ఇన్వెస్ట్‌మెంట్ మొత్తంపై వచ్చిన రాబడి కూడా మళ్లీ ఇన్వెస్ట్‌మెంట్‌ మొత్తానికి కలుస్తుంది. దీంతో ఇన్వెస్ట్‌ చేసిన మొత్తం పెరుగుతుంది. దీనిపై మళ్లీ రాబడి లభిస్తుంది’ అని పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కాంపౌండింగ్ ప్రయోజనం కారణంగా పదేళ్లకు పైన దీర్ఘకాలంలో రెండంకెల రాబడిని అందుకోవచ్చని ట్రాన్సెండ్ కన్సల్టెంట్స్ వెల్త్ మేనేజ్‌మెంట్ మేనేజర్ కార్తీక్ ఝవేరి తెలిపారు. మ్యూచువల్ ఫండ్ సిప్ మార్గంలో కనీసం 12 శాతం రాబడి లభిస్తుందని పేర్కొన్నారు.

Related posts