telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు వైఎస్‌ఆర్ ‘రైతు భరోసా’.. జమ కానున్న నగదు!

cm jagan ycp

ఏపీ సీఎం జగన్ ఈ ఉదయం 11 గంటలకు రైతు భరోసా కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించనున్నారు ఎన్నికల హామీ మేరకు వరుసగా రెండో ఏడాది అన్నదాతలకు సాయం అందించేలా వైఎస్ జగన్ నిధులను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్‌ఆర్ రైతు భరోసా పేరిట తొలివిడతగా రూ.5,500లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

గత సంవత్సరం 46.69 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు సహాయం అందింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కౌలు రైతుల కుటుంబాలకు సైతం ప్రభుత్వం సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 18 నుంచి విత్తనాల విక్రయం మొదలుకానున్న నేపథ్యంలో, రైతులకు విత్తనాల కొనుగోలుకు వీలు కల్పిస్తూ 15 నుంచే సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Related posts