కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో ఇళ్లకే పరిమితం అవుతున్న ప్రముఖులంతా సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా కరోనా కారణంగా రెండు నెలలపాటు అమెరికాలోని లాస్ఏంజెలెస్లో ఉన్న ఇంటికే పరిమితమైన బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా బయటకు వచ్చింది. అమెరికాలో పరిస్థితులు కొంచెంకొంచెంగా కుదుటపడుతున్న నేపథ్యంలో భర్త నిక్ జోనస్తో కలిసి ముఖానికి మాస్క్ ధరించి బయటకు వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. రెండు నెలల తర్వాత బయటకు వచ్చానని పేర్కొన్న ప్రియాంక ‘థ్యాంక్స్ టు మాస్క్స్’ అని పేర్కొంది. ఆమె పోస్టుకు ఇప్పటి వరకూ పది లక్షలకు పైగా లైకులు వచ్చాయి.
Eyes are never quiet. #FirstDayOutIn2Months pic.twitter.com/kILgeOz8Ep
— PRIYANKA (@priyankachopra) May 11, 2020