telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రేపు తెలంగాణ కేబినెట్‌ సమావేశం

KCR cm telangana

తెలంగాణ కేబినెట్‌ సమావేశం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో జరగనుంది. ఈ సమావేశంలో కరోనా వ్యాప్తి తాజా పరిస్థితులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ను పొడగించే అంశం, తెలంగాణ ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్‌ రూపకల్పన, వలస కార్మికుల అంశంపై చర్చ జరగనుంది.

అదేవిధంగా వ్యవసాయం కొనుగోళ్లు, వడగండ్ల వాన నష్టంపై ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇక తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 471కి చేరుకుంది. ఇప్పటివరకు 45 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ కాగా, 12 మంది మృతి చెందారు.

Related posts