telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుశాంత్ డెత్ మిస్టరీ… నటి రియా చక్రవర్తిని విచారించిన పోలీసులు

Sushanth

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఎంతో భవిష్యత్ ఉన్న యువ నటుడు బలవన్మరణానికి ఒడిగట్టడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అన్నికోణాల్లో అన్వేషిస్తూ సుశాంత్‌కి దగ్గరి వ్యక్తులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు అందరినీ విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని విచారించారు ముంబై పోలీసులు. గత కొంతకాలంగా రియా చక్రవర్తి- సుశాంత్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే వార్తలు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సుశాంత్ మరణం తర్వాత ఈ ఇద్దరికి సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే రియా చక్రవర్తిపై స్పెషల్ ఫోకస్ పెట్టి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు పోలీసులు. ఆమెను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వాళ్ళిద్దరి రిలేషన్‌షిప్ గురించి అన్ని కోణాల్లో ప్రశ్నలు వేస్తూ విచారణ చేపట్టారు. సుశాంత్ ఆత్మహత్య మిస్టరీని చేధించే క్రమంలో ఇప్పటి వరకు తొమ్మిది మంది నుంచి వాంగ్మూలం తీసుకున్నారు ముంబై పోలీసులు. సుశాంత్ క్రియేటివ్ కంటెంట్ మేనేజర్, హౌస్ కీపర్ దీపేష్ సావంత్, వంటమనిషి, సుశాంత్ తండ్రి కేకే సింగ్, ఇద్దరు సిస్టర్స్, సుశాంత్ స్నేహితులు మహేశ్ శెట్టి, సిద్ధార్థ్ పితాని నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నట్లు సమాచారం.

Related posts