telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నిమ్మగడ్డ రమేష్… జేబులో బొమ్మ

mopidevi venkataramana

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను టీడీపీ బహిష్కిరించింది. ఈ మేరకు నిన్న టీడీపీ నాయకత్వం ప్రకటన చేసింది. అయితే.. జిల్లా పరిషత్‌ ఎన్నికలను టీడీపీ బహిష్కరించడంపై ఎంపీ మోపిదేవి వెంకటరమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటమిని అంగీకరించలేకే చంద్రబాబు ఎన్నికలను బహిష్కరించారని.. ఇబ్బందులు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొనే నైజం చంద్రబాబుకు లేదని ఎంపీ మోపిదేవి వెంకటరమణ కామెంట్‌ చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగిందని హైకోర్టు స్పష్టం చేసిందని.. ఎన్నికల కమిషన్ ను రబ్బరు స్టాంపు అని కించపరిచే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు ఎంపీ మోపిదేవి. నిమ్మగడ్డ రమేష్ ను… జేబులో బొమ్మ కాబట్టి ఆయన గొప్ప అని… మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం సరైన విధానం కాదని చురకలు అంటించారు. మీ చేతకాని తనంతో ఎన్నికలను బహిష్కరిస్తున్నానని ఏ రోజైతే చెప్పావో ఆరోజే రాజకీయంగా చచ్చిపోయావని..దమ్ముంటే ప్రజాక్షేత్రంలో పోరాడాలని సవాల్‌ విసిరారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. ఎదురొడ్డి పోరాడే నైజం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది అని.. గతంలో కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్‌రెడ్డిని ఎన్నో ఇబ్బందులు పెట్టిందని గుర్తు చేశారు. తెరవెనుక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒక్కటేనని తెలిపారు.

Related posts