ఏ పని చేయకుండా ఇంట్లో ఉంటున్న కుమారుడిని ఓ తండ్రి మందలించాడు. దీంతో క్షణికావేశానికి లోనైనా కుమారుడు తండ్రిని కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం తంగిరాలపల్లిలో జరిగింది. స్థానిక ఎస్సీ కాలనీలో తండ్రిని కుమారుడు అతి కిరాతకంగా హత్య చేశాడు.
కుమారుడిని తండ్రి మందలించడంతో ఆగ్రహానికి గురైన కుమారుడు తండ్రిపై తిరుగబడ్డాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో కుమారుడు తండ్రి తలపై రోకలిబండతో బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ తండ్రిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.