బాలీవుడ్ నటీ హేమామాలినీ మథుర బీజేపీ అభ్యర్థి గా ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర తన శ్రీమతి హేమామాలినీ కోసం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ల వయస్సు నుంచే తన తల్లి తనలో దేశభక్తిని నూరిపోశారని అన్నారు. తనచిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. హేమకు ఓటేసి అభివృద్ధికి బాసటగా నిలవాలని కోరారు.
దంపతుల ప్రచారానికి జనం నుంచి మంచి స్పంన లభించింది. అంతకు ముందు హేమామాలినీని గెలిపించమంటూ ధర్మేంద్ర ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇదిలా ఉంటే ధర్మేంద్ర ప్రచారం గురించి హేమామాలిని ట్వీట్టర్లో ముందుగానే తెలియజేశారు. ఇవాళ తనకు ప్రత్యేకమైన రోజు అని హేమ పేర్కొన్నారు.