కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అధికార వైసీపీ స్వార్థ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఈ మేరకు ట్విటర్లో ఓ వీడియో పోస్టు చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1000 సాయం అందజేస్తుంటే అదేదో తామే అందజేస్తున్నట్లు అధికార పార్టీ వైసీపీ కలర్ ఇవ్వడం తగదని మండిపడ్డారు.
రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కేంద్రం అందించే సాయానికి వైసీపీ స్టిక్కర్లు వేస్తారా? అని ప్రశ్నించారు. చాలా చోట్ల డబ్బు అందించేందుకు వాలంటీర్లతో కలిసి వైసీపీ నాయకులు తిరుగుతూ ఓట్ల కోసం ప్రయత్నాలు చేయడాన్ని తప్పుపట్టారు. ఈ విషయాన్ని తమ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని చెప్పారు.
టీం ఇండియా గెలుపు కోసమే సానియా అక్కడికి వెల్లిందట!