పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైసీపీ బుధవారం షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ షోకాజ్ నోటీసుకు రఘురామ కృష్ణంరాజు సమాధానమిచ్చారు. వైసీపీ ఇచ్చిన నోటీసుకు చట్టబద్ధత లేదని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. విజయసాయిరెడ్డి ఇచ్చిన నోటీసుపై ఆయన స్పందించారు. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి గెలిచానని, తనకు ఇచ్చిన లెటర్హెడ్కు బీఫామ్కు తేడాలున్నాయని అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్తో నోటీసులు ఇచ్చారని, వైఎస్ఆర్సీపీతో నోటీసు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారు? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ సంఘం ఉందా? క్రమశిక్షణ సంఘానికి ఎన్నికల గుర్తింపు ఉందా? క్రమశిక్షణ సంఘానికి ఛైర్మన్, సభ్యులెవరు? మీటింగ్ ఎప్పుడు పెట్టారని ప్రశ్నించారు.