telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఢిల్లీకీ వెళ్లొచ్చిన వ్యక్తికి కరోనా.. మంగళగిరిలో కలవరం

corona

ఢిల్లీ నిజాముద్దీన్‌లో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన మంగళగిరి వ్యక్తికి గతరాత్రి నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు తేలడంతో  స్థానికులు కలవరం చెందారు. దీంతో ఏపీ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగాబాధితుడు నివసిస్తున్న టిప్పర్ బజార్‌లోని ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో కూరగాయల దుకాణాలు, మార్కెట్లను మూసివేయించారు.

వైరస్ సోకిన వ్యక్తితో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించినట్టు అధికారులు పేర్కొన్నారు. కేసు వెలుగు చూడడంతో సమీప ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. నిన్న రాష్ట్రంలో 67 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మంగళవారం రాత్రి వరకు 44గా ఉన్న కేసుల సంఖ్య ఒక్కసారిగా 111కు చేరుకుంది. రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 కేసులు నమోదయ్యాయి.

Related posts