telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు ఢిల్లీకి చంద్రబాబు…పోలింగ్ తీరు పై సీఈసీకి ఫిర్యాదు!

Chandrababu comments Jagan cases

ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. ఏపీలో పోలింగ్ జరిగిన తీరు, ఈవీఎంల ఇబ్బందులపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. అలాగే వీవీ ప్యాట్ల లెక్కింపుపై సుప్రీంలో టీడీపీ రివిజన్ పిటిషన్ వేయనుంది. ఎన్నికల నిర్వహణ వైఫల్యాలపై ప్రశ్నించనున్నారు.

చంద్రబాబుతో పాటు కళా వెంకట్రావు, యనమల తదితర ముఖ్య నేతలు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనకు రావాలని పలువురు మంత్రులకు కూడా పిలుపు వెళ్లింది. టీడీపీ ఎంపీలందరూ ఈ సందర్భంగా చంద్రబాబు వెంట ఉండనున్నారు. మరోవైపు, ఈసీ వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలో చంద్రబాబు ధర్నా చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Related posts