కేరళ కాంగ్రెస్ కు చెందిన రాష్ట్ర మహిళా నాయకురాలు లితికా సుభాష్ టికెట్ రాలేదని వినూత్న నిరసన చేపట్టారు. టికెట్ రాకపోవడంతో ఆమె తన పదవికి రాజీనామా చేయడమే గాక శిరోముండనం చేయించుకుంది. అసలు వివరాల్లోకి వెళితే.. ఎత్తుమన్నూర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయాలనుకున్నారు. అయితే లిస్టులో తన పేరు లేకపోవడంతో ఆమె ఆగ్రహించి పార్టీ కార్యాలయం ముందే గుండు కొట్టించుకున్నారు. కేరళ ఎన్నికలకు కాంగ్రెస్ తమ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్ ఢిల్లీలో ఈ జాబితాను రిలీజ్ చేస్తూ మహిళా అభ్యర్థులు తగినంతమంది లేరని చెప్పారు. దీంతో ఆ మహిళా నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీపై నిప్పులు చెరగడమే కాకుండా.. రాజీనామా చేసి.. శిరోముండనం చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు షాక్ తిన్నారు. అయితే.. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఇంకా స్పందించలేదు. కానీ ప్రస్తుతం ఏ వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది.
previous post
అచ్చెన్నాయుడి తీరును చూసి రాష్ట్రం అసహ్యించుకుంటుంది: రోజా