telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పీపీఏలపై హైకోర్టు తీర్పు జగన్ సర్కారు కు చెంప పెట్టు: కళా వెంకట్రావ్

kalavenkat rao tdp

పీపీఏలపై హైకోర్టు తీర్పు జగన్ సర్కారు చెంప పెట్టు అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కళావెంకట్రావ్, కొనకళ్ల నారాయణ, బొండా ఉమ మాట్లాడారు. పీపీఏలపై హైకోర్టు తీర్పుతో అయినా సీఎం జగన్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీపై తప్పుడు నిందలు వేశారన్నది హైకోర్టు తీర్పుతో రుజువైందన్నారు. పరిపాలనలో జగన్ 3 అడుగులు ముందుకెళ్తే.. 6 అడుగులు వెనక్కి వస్తున్నారని విమర్శించారు.

టీడీపీపై కక్ష సాధింపు తప్ప అభివృద్ధి కోసం ఒక్క ఆలోచనా జగన్ చేయడం లేదని దుయ్యబట్టారు. ముడుపులు డిమాండ్ చేయడం కోసమే జీవో 63 జారీ చేశారని కొనకళ్ల నారాయణ ఆరోపించారు. పరిపాలనపై జగన్‌కు ఉన్న అవగాహన ఇక్కడ బయటపడిందన్నారు. ప్రభుత్వ అసమర్థతకు కోర్టు తీర్పు నిదర్శనం అని అన్నారు. పీపీఏలపై ఎవరెన్ని చెప్పినా రివర్స్‌లో వెళ్లి భంగపడ్డారంటూ సీఎం జగన్‌పై టీడీపీ నేత బొండా ఉమ దుయ్యబట్టారు.

Related posts