వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని పారిశుధ్య కార్మికుల పని వేళలు మార్చినట్లు జిహెచ్ఎంసి ఒక ప్రకటనలో తెలిపింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున జిహెచ్ఎంసి పారిశుధ్య కార్మికులు ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 5 గంటల లోపు బయోమెట్రిక్ హాజరై మధ్యాహ్నం 12 గంటల వరకు విధులు నిర్వహించాలని జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్ తెలిపారు. ఈ పని వేళలు వేసవి కాలం ముగిసే వరకు కొనసాగుతాయని తెలిపారు.