telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని పారిశుధ్య కార్మికుల పని వేళలు మార్చిన జిహెచ్ఎంసి

వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని పారిశుధ్య కార్మికుల పని వేళలు మార్చినట్లు జిహెచ్ఎంసి ఒక ప్రకటనలో తెలిపింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున జిహెచ్ఎంసి పారిశుధ్య కార్మికులు ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 5 గంటల లోపు బయోమెట్రిక్ హాజరై మధ్యాహ్నం 12 గంటల వరకు విధులు నిర్వహించాలని జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్ తెలిపారు. ఈ పని వేళలు వేసవి కాలం ముగిసే వరకు కొనసాగుతాయని తెలిపారు.

Related posts