ప్రముఖ టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సామజిక అంశాలపై దృష్టి పెట్టారు. గత కొంతకాలంగా వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న మంచు మనోజ్ చివరగా నటించిన చిత్రం “ఒక్కడు మిగిలాడు”. ఈ చిత్రం ఆయన అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఆ తరువాత మనోజ్ ఒక్క చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక సినిమాల్లో నటించనంటూ అప్పట్లో ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు మంచు మనోజ్. ఇప్పుడు మనోజ్ హాయిగా టూర్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. దాంతో పాటు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు జరుగుతున్న ఇష్యూస్పై స్పందిస్తున్నాడు. అంతేకాదు ప్రత్యక్షంగా అభిమానులతో కూడా ఇంటరాక్ట్ అవుతూ పలు విషయాలపై చర్చిస్తున్నాడు. దానికితోడు వాళ్ల కష్టాలను కూడా పంచుకుంటున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేసాడు మనోజ్. తాజాగా పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు తనకు ఎదురైన కష్టాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. సాయినాథ్ కల్యాణ్ అనే కుర్రాడు తను పవన్ కళ్యాణ్ అభిమానిని అని, జనసేన పార్టీ కోసం తిరిగానని, తనకు పవన్ అంటే ప్రాణమని.. ఆయన కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అని రాసుకొచ్చాడు. ఇక ఇప్పుడు తన తండ్రికి సీరియస్గా ఉందని, కానీ తన దగ్గర వైద్యం చేయించుకునేంత ఆర్థిక స్థోమత లేదని చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, జేడీ లక్ష్మీనారాయణ, మంచు మనోజ్ లాంటి వాళ్లకు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసాడు. మనోజ్ చూసి వెంటనే “నీ వివరాలు పంపు స్వామి.. మా వాళ్లు నీ దగ్గరికి వచ్చి కలుస్తారు.. ధైర్యంగా ఉండు మీ నాన్నకు ఏం కాదు” అంటూ ధైర్యం చెప్పాడు. ఇప్పుడు మంచు మనోజ్ మంచి మనుసు చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు.
Please send me ur details swamy …🙏🏻❤️ https://t.co/7HU0zdVits
— MM*🙏🏻❤️ (@HeroManoj1) 15 October 2019
My people wil get in touch in ur home town swamy … Stay strong and wil pray for ur fathers speedy recovery 🙏🏻❤️ https://t.co/0NVREwBfgl
— MM*🙏🏻❤️ (@HeroManoj1) 15 October 2019