కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తన్ని అతలాకుతల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు వేల సంఖ్యలో పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎందరో రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. అయితే..
తాజాగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఎమ్మెల్యే షకీల్ హోం క్వారంటైన్లో ఉన్నారు. వారం రోజుల కింద ఎమ్మెల్యే తండ్రికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ క్రమంలో స్వల్ప లక్షణాలతో నిన్న టెస్ట్ చేయించుకున్న ఎమ్మెల్యే షకీల్కు కరోనా అని తేలింది. దీంతో తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. కాగా..తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 965 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక ఐదుగురు కరోనాతో మృతిచెందారు. ఇదే సమయంలో 312 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 3,09,741 కు చేరగా.. రికవరీ కేసులు 3,01,876 కు పెరిగాయి.. మరోవైపు.. ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,706 మంది మృతి చెందారు.
previous post
పుచ్చిపోయిన పన్నుకి సింగపూర్ వెళ్లమని ఎవరు చెప్పారు?: యనమలపై రోజా ట్వీట్