స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా పుష్ప. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా.. డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొంటున్నాయి. తాజాగా పుష్ప ది రైజ్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో ‘పుష్ప’ రాజ్ గా బన్నీ మాస్ లుక్ అదిరిపోయింది. శేషాచలం అడవుల్లో అరుదుగా దొరికే ఎర్రచందనం చెక్కలను స్మగ్లింగ్ చేస్తూ అక్కడి వారు బతుకుతూ ఉంటారు.
గంధపు చెక్కల స్మగ్లర్ గా పుష్పరాజ్ పనిచేస్తుంటాడు.. వాటిని పోలీసులకు తెలియకుండా రాష్ట్రం దాటిస్తూ ఉంటాడు.. వీరిద్దరికి మధ్య జరిగే యుద్ధమే పుష్ప ది రైజ్.. పోలీసులకు, స్మగర్లకు మధ్య రాజకీయ నాయకులు, దళారులు ఎలా వీరిని వాడుకున్నారు అనేది చూపించారు.
ఇందులో పుష్పరాజ్, శ్రీవల్లీల పల్లెటూరు యాస, రొమాన్స్ ఆకట్టుకొంటుంది.. ఇక చివర్లో ఫహద్ ఫాజిల్ పార్టీ లేదా పుష్ప అంటూ వెటకారంగా అన్న డైలాగ్ ట్రైలర్ కి హైలెట్ గా నిలిచింది.
బన్నీ- సుకుమార్ కాంబోలో వస్తున్నా మూడో చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇందులో గంధపు చెక్కల స్మగ్లర్ పుష్పరాజ్గా బన్నీ మాస్ లుక్లో అదిరిపోయాడు. ఇందులో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనంజయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కాగా..ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ తో సందడి చేయనుంది.
నా దెబ్బకు విజయ్ మరో రెండేళ్ల వరకు సినిమా చేయడు : రష్మిక మందన్న