telugu navyamedia
సినిమా వార్తలు

“విరాట పర్వం”లో సాయి పల్లవి పాత్ర ఇదే…!

Sai-Pallavi

రానా, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం “విరాటపర్వం 1992”. “నీది నాది ఒకే కథ” ఫేం వేణు ఊడుగుల చిత్రానికి దర్శత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటిస్తోంది. ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 1990ల నాటి సామాజిక ప‌రిస్థితుల ఆధారంగా ఈ మూవీని వేణు తెర‌కెక్కించ‌నున్నాడు. పీరియాడిక్ సోష‌ల్ డ్రామాగా రూపొందనుంది. వైజాగ్‌కి చెందిన అల‌నాటి బాలీవుడ్ నటి జ‌రీనా వాహ‌బ్ కూడా చిత్రంలో ముఖ్య పాత్ర పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. బాలీవుడ్ న‌టుడు నానా ప‌టేక‌ర్ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. అలానే ట‌బు పాత్ర కూడా కాస్త నెగెటివ్ షేడ్ లో ఉంటుందట‌. ఇప్ప‌టికే చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా, సాయి ప‌ల్ల‌వి టీంతో ఇటీవ‌ల క‌లిసింది. తాజా స‌మాచారం ప్ర‌కారం సాయి ప‌ల్లవి విరాట ప‌ర్వం చిత్రంలో వ‌రంగ‌ల్ అమ్మాయిగా క‌నిపించి సంద‌డి చేయ‌నుంద‌ట‌. న‌క్స‌లిజం నేప‌థ్యంలో పీరియాడిక్ ల‌వ్ స్టోరీగా ఈ చిత్రం ఉండ‌నుంద‌ని అంటున్నారు. ఫోక్ సింగ‌ర్‌గా సాయి ప‌ల్ల‌వి ఆక‌ట్టుకుంటుంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం రానాకి కిడ్నీ ట్రీట్‌మెంట్ జ‌రుగుతుండ‌గా, అది పూర్తైన త‌ర్వాత అక్టోబ‌ర్‌లో సాయి పల్ల‌వి, రానా మ‌ధ్య కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

Related posts