దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో “ఆర్ఆర్ఆర్” అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. జూలై 30, 2020న విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తైందని ఇటీవల మేకర్స్ తెలిపారు. అయితే చిత్రంలో చరణ్ సరసన కథానాయికగా అలియా భట్, ఎన్టీఆర్కి జోడీగా ఓలివియా మోరిస్పై సనటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చితాన్ని వచ్చే ఏడాది జూలై 30న విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. జనవరి నుండి చిత్ర ప్రమోషన్స్ మొదలు పెట్టాలని జక్కన్న భావిస్తుండగా, సినిమాలోని పాత్రలని ఒక్కొక్కటిగా విడుదల చేయనున్నట్టు సమాచారం. సినిమా మొదలైనప్పటి నుండి ఈ చిత్రం ఆర్ఆర్ఆర్ అనే పేరుతోనే ప్రచారం జరుపుకుంటుంది. ఆర్ఆర్ఆర్ పూర్తి పేరు భాషని బట్టి మారుతుందని తెలుస్తుంది. తెలుగులో రామ రావణ రాజ్యం అని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరగగా, ఇప్పుడు ఈ టైటిల్ ఆర్ఆర్ఆర్కి పెట్టే ఛాన్స్ లేదు. అందుకు కారణం వి3 ఫిలింస్ అనే సంస్థ రామ రావణ రాజ్యం అనే టైటిల్ని చాంబర్లో రిజిస్ట్రేషన్ చేయించుకుందట. ఆర్ఆర్ఆర్ చిత్రం రామ రౌద్ర రుషితం అనే పేరుతోను ప్రచారం జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.
పవన్ కు వ్యతిరేకంగా మేము ప్లాన్ చేయలేదు… ట్రోల్ చేయకండి : రాజశేఖర్