శ్రీదేవి, జాన్వీ కపూర్ల ముద్దుల తనయ జాన్వీ కపూర్ దఢఖ్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం విదితమే. తల అజిత్ ప్రస్తుతం బోని కపూర్ నిర్మాణంలో పింక్ రీమేక్ చిత్రంగా “నెర్కొండ పార్వాయి” అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఖాకీ ఫేం హెచ్ వినోథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, శ్రద్ధా శ్రీనాథ్, అభిరామి వెంకటచలం, ఆండ్రియా తరియంగ్లు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. లాయర్ పాత్రలో అజిత్ కనిపించనున్నాడు . వ్యభిచార గృహాల్లో చిక్కుకున్న ముగ్గురు యువతులను రక్షించే న్యాయవాది ఇతివృత్తంగా తమిళ నేటివిటీకి అనుగుణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తర్వాత అజిత్ మరోసారి వినోద్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కీలక పాత్రలో కనిపించనుందట. ఈ చిత్రంతో జాన్వీ తమిళ తెరకి పరిచయం కానుందని చెబుతున్నారు.
previous post
next post
మెగా ఫ్యామిలీ నిజమైన వారసుడు అల్లు అర్జున్… హీరోలపై మాధవి సంచలన కామెంట్స్