telugu navyamedia
సినిమా వార్తలు

“చిత్రలహరి” ప్రీ రిలీజ్ కు అతిథిగా ఎన్టీఆర్?

NTR

సాయిధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో “చిత్రలహరి” సినిమా రూపొందుతోంది. కళ్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాలో సునీల్, వెన్నెలకిషోర్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో నిర్మితమవుతోన్న ఈ చిత్రం టీజర్ ని ఇటీవలే విడుదల చేసారు. ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది ప్రేక్షకుల్లో. ఈ సినిమాను ఏప్రిల్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడానికి మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరుకానున్నట్టు సమాచారం. “జనతా గ్యారేజ్” సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లోనే తెరకెక్కడంతో వారికి ఎన్టీఆర్ తో మంచి స్నేహబంధం వుంది. దీంతో వాళ్ల ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ రానున్నాడని తెలుస్తోంది. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. నిజానికి ఈ వేడుకకి చిరంజీవిగానీ, చరణ్ గాని ముఖ్య అతిథులుగా రావాల్సి ఉండగా… ఏపీ ఎన్నికల్లో “జనసేన” పోటీ చేస్తుండటంతో మీడియాకు దూరంగా ఉంటున్నారట మెగా ఫ్యామిలీ. 

Related posts