శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో “రణరంగం” అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ప్రశాంత్ పిళ్ళై సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన కాజల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాకినాడ ప్రాంతంలో ఉండే చిన్న రౌడీ… మాఫియాగా మారే నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో శర్వానంద్ రెండు డిఫరెంట్ లుక్స్లో కనిపించనున్నాడని చెబుతున్నారు. శర్వా చేయబోవు రెండు పాత్రలలో ఒకటి యంగ్ ఏజ్ వ్యక్తి కాగా, మరొకటి ముసలి వ్యక్తి అని అంటున్నారు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్లో విడుదలవుతుందని అన్నారు. కానీ తాజాగా సెప్టెంబర్ రెండో వారంలో “రణరంగం”ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది.
previous post
next post