జనసేన నాయకుడు, సినీ నిర్మాత ‘బన్నీ’వాసు సోదరుడు గవర సురేష్ ఇటీవల మృతి చెందారు.. ఈ సందర్భంగా ప్రత్యేకంగా పాలకొల్లు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించారు ప్రముఖ సినీనటుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఈయనతో పాటు సినీనటుడు అల్లు శిరీష్, ఎమ్మెల్యే శ్రీ డా.నిమ్మల రామానాయుడు, జనసేన పాలకొల్లు నివర్గ ఇంచార్జి గుణ్ణం నాగబాబు కూడా ‘బన్నీ’వాసు కుటుంబాన్ని పరామర్శించారు. ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో, మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న క్రేజీ ప్యాన్ ఇండియా మూవీ పుష్ప. అలా వైకుంటపురంలో మరియు రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్స్ తరువాత అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో చేస్తున్న మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై ఫ్యాన్స్ తో పాటు అటు సామాన్య ప్రేక్షకుల్లో కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన పుష్ప ఫస్ట్ లుక్ కి ప్రేక్షకులు, అభిమానుల దగ్గర నుంచి అనూహ్యమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే.
previous post