కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఎంపిక చేసారు. తెలుగుచిత్ర సీమలో హిట్ సినిమాతో అరంగేట్రం చేసి వరుస విజయాలు అందుకుంది. తనదైన నటనతో అందరిని అలరించి లక్కీ బ్యూటీ బిరుదును సంపాదించింది. అయితే సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తున్న మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది ఈ భామ. తెలుగుఓ పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది రష్మిక. అయితే.. తాజాగా ఆడవాళ్లు మీకు జోహర్లు నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇవాళ రష్మిక పుట్టిన రోజు సందర్భంగా ఈ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ మూవీని కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తుండగా.. శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు.
previous post
next post