telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు..ఈసీ పై చంద్రబాబు ఆగ్రహం

CM Chandrababu fire to CEC

టీడీపీ నేతల ఫిర్యాదులను ఎన్నికల సంఘం(ఈసీ) అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులపై ఈసీ అధికారులు వెంటనే స్పందిస్తున్నారని దుయ్యబట్టారు.కర్నూలు జిల్లాలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రతిపక్షాలు అధికారులను బెదిరిస్తున్నప్పుడు ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణలో కేసీఆర్ 25 లక్షల ఓట్లను తొలగిస్తే, ఏపీలో 9 లక్షల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తాము అప్రమత్తమై ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. దాదాపు 85 శాతం నిజమైన ఓట్లను వైసీపీ నేతలు తొలగించారనీ, రెడ్ హ్యాండెడ్ గా ఓట్ల దొంగలు పట్టుబడ్డారని తెలిపారు. అయినపట్టికీ ఓట్ల దొంగలపై ఎన్నికల సంఘం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈసీని చంద్రబాబు ప్రశ్నించారు.

Related posts