telugu navyamedia
సినిమా వార్తలు

నిర్మాత మహేశ్‌ కోనేరు కన్నుమూత

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత, జూనియర్ ఎన్టీఆర్ పి.ఆర్.వో మహేశ్ కోనేరు ఈ రోజు ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 38 సంవత్సరాలు. దసరా సెలవులకు స్వస్థలం వైజాగ్ వెళ్ళిన మహేశ్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్ గా కెరీర్ ఆరంభించి ఆ తర్వాత సినిమాలకు పి.ఆర్.వోగా పని చేశారు.

ఆ తర్వాత ఎన్టీఆర్ కు పర్మినెంట్ పి.ఆర్.వోగా సెటిల్ అయిన మహేశ్ ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి నిర్మాతగా కూడా మారారు. 118, మిస్ ఇండియా, తిమ్మరుసు వంటి స్ట్రెయిట్ సినిమాలతో పాటు విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాను తెలుగువారికి అందించాడు. మహేశ్ మృతి పట్ల ఎన్టీఆర్ తో పాటు చిత్రరంగ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.

Related posts