telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అంబానీకి డబ్బులిస్తానంటున్న రాఖీ సావంత్…!

rakhi savanth on pulwama attack

బాలీవుడ్ ఐటెం గర్ల్ రాఖీ సావంత్ అంబానీ ప్రారంభించిన జియో సర్వీసులపై కామెంట్ చేసింది. జియో సిమ్ కార్డులకు బాగానే హైప్ వచ్చినా రాను రాను నెట్‌వర్క్ సమస్యలు తలెత్తాయి. సిమ్ కార్డ్‌తో పాటు కాల్స్, మెసేజెస్, నెట్ ఉచితంగా ఇష్తానని అంబానీ జనాలను ఊరించారు. దాంతో అంతా ఎగబడి జియో సిమ్ కార్డులు తీసుకున్నారు. నెమ్మదిగా జియోకు నెట్‌వర్క్ సమస్యలు వచ్చాయి. దీని గురించి కామెంట్ చేస్తూ రాఖీ సావంత్ టిక్ టాక్ వీడియో చేసింది. ‘అంబానీ.. కావలంటే 50, 60 రూపాయలు ఎక్కువ ఇస్తాను. సరైన నెట్‌వర్క్ ఇచ్చి మా సమస్యలను పరిష్కరించు’ అని కామెంట్ చేసింది. ఫ్రస్టేషన్‌లో రాఖీ వీడియోలో ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే పడి పడి నవ్వుకుంటారు. ఇకపోతే ఇటీవల ఈ వివాదాస్పద నటి యూకేకి చెందిన ఎన్నారైను పెళ్లి చేసుకుంది. అయితే అతని పేరు రితేష్ అని వెల్లడించింది కానీ ముఖం మాత్రం చూపించలేదు. ప్రస్తుతం తన భర్తతో కలిసి యూకేలోనే ఉంటోంది. మరో విషయం ఏంటంటే.. ఇటీవల యూకేలోని తన ఇంటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే అది ఇల్లు కాదు హోటల్ రూం అని చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

తాను రాఖీ సావంత్‌ను పెళ్లి చేసుకున్న మాట నిజమేనని రితేష్ ఇటీవల మీడియా ముందు వెల్లడించాడు. తన విషయంలో రాఖీని టార్గెట్ చేస్తున్నవారికి సమాధానం చెప్పడానికి ఏదో ఒక రోజు మీడియా ముందుకు వస్తానన్నాడు. రాఖీ సినిమాల్లో ఎలాంటి వేషాలు వేసినా వాటిలో నిజాయతీ ఉందని రితేష్ తన భార్యను వెనకేసుకొచ్చాడు. రాఖీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆ ధైర్యవంతుడెవరో చూసేందుకు అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఎదురుచూస్తున్నారు.

Related posts