పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ “ఇస్మార్ట్ శంకర్” అద్భుతమైన కలెక్షన్లు సాధించి దూసుకుపోతుంది. ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాని పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. జూలై 18న విడుదల అయిన ఈ చిత్రం అదే క్రేజ్తో ముందుకు సాగుతోంది.
తాజాగా ఈ సినిమా ఈ గురువారంతో మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్గా రన్ అవుతూ ఉంది. తాజాగా ఈ సినిమా రూ.35.51 కోట్ల షేర్ .. రూ. 71.35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలంగాణ,ఏపీలో రూ. 32.70 కోట్లను కొల్లగొట్టింది ఇస్మార్ట్ శంకర్. కర్ణాటకలో ఈ సినిమా రూ. 1.45 కోట్లను ఓవర్సీస్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తంగా రూ.కోటి వరకు రాబట్టింది. చాలా రోజుల తర్వాత ఇస్మార్ట్ శంకర్తో మంచి విజయం దక్కడంతో రామ్ ఫుల్ ఖుషీలో ఉన్నాడు. ‘డియర్ కామ్రేడ్’ వచ్చిన తర్వాత కూడా ఇస్మార్ట్ దూకుడు సాగుతూనే ఉంది. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఇస్మార్ట్ శంకర్ 14 రోజుల్లోనే 35.51 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికే అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాను బ్రేక్ ఈవెన్కు చేరుకోవడమే కాదు.. కొన్న దానికి రెండింతలు లాభాలు తీసుకొచ్చింది. త్వరలోనే ఈ సినిమాకు భారీ సక్సెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.