telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ అభిమానులకు మళ్ళీ నిరాశేనా ?

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పింక్’కు ఇది రీమేక్. అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను ఇక్కడ పవన్ కళ్యాణ్ పోషిస్తుడటంతో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీకి కరోనా అడ్డంకిగా మారడంతో అప్డేట్స్ సైతం ఆగిపోయాయి. అనుకున్న ప్రకారం అయితే ఈ సినిమా మే 15న విడుదల కావాల్సింది. ఈ వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో ఈ సినిమా షూటింగ్ లోని చివరి షెడ్యూల్ వాయిదా పడింది. ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్స్ కు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన వకీల్ సాబ్ మాత్రం ప్రారంభం కాలేదు. అయితే తమ అభిమాన హీరోను ఎప్పుడెప్పుడు వెండితెర పై చూద్దామా అనుకుంటున్న పవర్ స్టార్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ చెప్పాడు పవన్. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో వకీల్ సాబ్ పై పవన్ స్పందిస్తూ.. కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ షూటింగ్ చేయడం కష్టం. కాబట్టి ఇప్పట్లో షూటింగ్ మొదలుపెట్టడం సరికాదు అని అన్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఆయన మాటలనుబట్టి చూస్తే ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే అని తెలుస్తుంది.

Related posts