*తప్పుడు సర్వేలను ప్రజలు నమ్మరు..
*రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మిర్యాలగూడ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ ఎవరు ఎన్ని తప్పుడు సర్వేలు రాయించుకున్నా..కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఆదరణ ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో గొర్రెలు, బర్రెలు గుర్తొస్తాయని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తయిన ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదని , ధనిక రాష్ర్టమైన తెలంగాణను కేసీఆర్ అప్పులు ఊబిలోకి నెట్టాడని ఆయన ఆరోపించారు. ప్రజాదరణ, పార్టీ అభివృద్దికి కృషిచేస్తున్నవారికి సర్వేల ప్రకారం టికెట్లు కేటాయిస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే భాస్కరరావు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కాంట్రాక్టు పనులు..రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ మా కార్యకర్తలను బెదిరిస్తున్నాడని ఆయన మండిపడ్డారు.
ఎమ్మెల్యే భాస్కర్ రావు తన బంధువులైన పోలీస్ అధికారులను తెచ్చుకొని కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నన్ను బీజేపీ, టీడీపీలు కరివేపాకులా వాడుకున్నాయి: పవన్