telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కంపెనీ ప్రమాదాలపై వైసీపీ సర్కారు నిర్లక్ష్యం: చంద్రబాబు

tdp chandrababu

విశాఖలో ఫార్మా కంపెనీ ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఈ ఘటనపై పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  రెండు నెలల వ్యవధిలోమూడు కంపెనీల్లో ప్రమాదాలు జరిగాయని అన్నారు. కంపెనీ ప్రమాదాలపై వైసీపీ సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. బాధితులను ఆదుకోకుండా, ఆయా కంపెనీలకే వత్తాసు పలుకుతోందంటూ విమర్శించారు. ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టడంలేదని ఆరోపించారు. తమ వైఫల్యాలపై టీడీపీ మీద నిందలు వేయడం వైసీపీ నేతలకు దురలవాటుగా మారిందని అన్నారు.

కరోనా పరిస్థితులను ప్రస్తావిస్తూ కరోనా చికిత్సపై మంత్రులకే నమ్మకం లేదని అన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తిరుపతిలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి, హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరడమే అందుకు నిదర్శనమన్నారు. కరోనా నియంత్రణ కన్నా కక్ష సాధించడంపైనే వైసీపీ ఎక్కువగా దృష్టి సారించిందని ఆరోపించారు.

Related posts