ఏబీపీ న్యూస్, సీ ఓటర్ సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించాయి. కరోనా క్రైసిస్ను దేశం ఎలా ఎదుర్కొంది? అన్ని రాష్ట్రాల సీఎం పనితీరు ఎలా ఉంది ? అనే అంశాలపై ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు కలిసి ఓ సర్వే చేశాయి. ఈ సర్వేలో బెస్ట్ సీఎంలలో జగన్ మూడో స్థానం దక్కించుకున్నారు. టాప్ 10 బెస్ట్ సీఎంలలో మొదటి స్థానంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, రెండో ప్లేస్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మూడో ప్లేస్లో ఏపీ సీఎం జగన్ నిలిచారు. అటు వరస్ట్ సీఎంల జాబితాను కూడా ప్రకటించింది ఈ సర్వే సంస్థ. అయితే.. ఈ సర్వేలో మొదటి స్థానంలో ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఉండగా.. రెండో స్ఠానంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, మూడో స్థానంలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, నాలుగో స్థానంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నిలిచారు. ఇక ఐదో స్థానంలో తమిళనాడు సీఎం పళనిస్వామి ఉన్నారు.
previous post