ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీ నేతల మధ్య వర్గ పోరు మొదలైంది. జిల్లాలో రెండు వర్గాల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. తాజాగా చాపాడు మండలం బద్రిపల్లెలో వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా వైసీపీలోని రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది.
గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఒక వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపిస్తూ స్థానిక ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై మరో వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ఆయన ఫ్లెక్సీలకు కూడా చించేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.