telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

గుడ్ న్యూస్ ఏపీలో మళ్ళీ తగ్గిన కేసులు..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ జోరు కొనసాగుతూనే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే వున్నాయి. ఇవాళ ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో నమోదు అయిన కరోనా కేసుల విషయానికొస్తే 3,892 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో కరోనా కేసులు 767465 కు చేరువలో ఉన్నాయి. ఇక నిన్నటితో పోలిస్తే కరోనా మరణాలు ఇవాళ తగ్గాయి. ఈరోజు 28 మంది కరోనాతో మరణించారు. దీంతో కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 6319కు చేరుకుంది.

రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 767465 పాజిటివ్ కేసులకు గాను, 719477 మంది డిశ్చార్జి అయ్యారు. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 41669 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా కరోనా మరణాలు తగ్గిన కూడా తూర్పు గోదావరి, చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 70 వేల కరోనా పరీక్షలు చేసారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Related posts