ప్రపంచవ్యాప్తంగా అన్నీ దేశాలపై కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ఆయా దేశాల ప్రభుత్వాలు పకడ్బంధీ చర్యలు చేపడుతున్నారు. ముస్లింలకు అత్యంత ప్రధానమైన సౌదీ అరేబియా కూడా కరోనా దెబ్బకు వణికిపోతోంది. ఈ క్రమంలో సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలైన మక్కా, మదీనాలో 24 గంటల పాటు కర్ఫ్యూ విధించింది. అంతేాకాదు ఈ ప్రాంతాల్లో తిరిగే కార్లలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే ప్రయాణించాలని ఆదేశించింది.
సౌదీలో ఇప్పటి వరకు దాదాపు 2 వేల మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 20 మందికి పైగా మరణించారు. దీంతో, కరోనాను కట్టడి చేసేందుకు ఆ దేశం లాక్ డౌన్ విధించింది. అంతర్జాతీయ విమాన సేవలను రద్దు చేసింది. ఇతర దేశాల ప్రజలు మక్కా, మదీనా కోసం ఎలాంటి బుకింగ్స్ చేసుకోవద్దని ఇప్పటికే ప్రకటించింది.