అవినీతిని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇక శాసనసభ్యుడిని అరెస్ట్ చేసే ముందు రాజ్యాంగ నిబంధనలను పాటించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని చెప్పారు. అయితే అచ్చెన్న విషయంలో వీటిని పాటించలేదనిపిస్తోందని విమర్శించారు. ఈఎస్ఐలో జరిగిన అవకతవకలతో పాటు, ఇప్పటి వరకు జరిగిన అన్ని అక్రమాలపై చిత్తశుద్ధితో దర్యాప్తు జరిపించాలని జనసేన డిమాండ్ చేస్తోందని చెప్పారు.
అవినీతి ఆరోపణలతో టీడీపీ నేత అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయడంపై జనసేన పార్టీ అనుమానాలను వ్యక్తం చేసింది. అవినీతికి పాల్పడినందుకు అరెస్ట్ చేశారా? లేక కక్ష సాధింపుకు పాల్పడ్డారా? అనిమనోహర్ ప్రశ్నించారు. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
కాలుష్యంపై బీజేపీ నేతల రాజకీయాలు: కేజ్రివాల్