*నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన
*వాహన మిత్ర లబ్ధిదారులకు ఆర్థిక సాయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ జరిగే బహిరంగ సభలో వైఎస్సార్ వాహన మిత్రవాహన మిత్ర లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు.. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
వరుసగా నాలుగో ఏడాది వాహనమిత్ర పథకాన్ని జగన్ లబ్దిదారులకు అందివ్వనున్నారు. ఒక్కొక్కరికి పదివేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. వాహనమిత్ర పధకం కింద 2,61,516 మంది లబ్ది పొందనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 261.52 కోట్ల రూపాయలను కేటాయించనుంది.
సొంత వాహనం ఉన్న ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ఈ సాయం ప్రభుత్వం అందిస్తూ వస్తోంది. ఇప్పటి వరకూ ప్రభుత్వం వాహనమిత్ర పధకం కింద 1,026 కోట్ల రూపాయలను అందించింది. ఒక్కొక్కరికి నలభై వేల రూపాయల సాయం చేసింది. ఈరోజు జగన్ విశాఖ పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
రామ్గోపాల్ వర్మ సైకో డైరెక్టర్: యామిని