ఏపీ సీఎం జగన్ ఇటీవల పోలవరం ప్రాజక్టుపై తీసుకున్న నిర్ణయాలపై ప్రతికూలత ఎదురవుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హైడల్ ప్రాజెక్టుపై నవయుగ సంస్థ కోర్టులో సవాల్ చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు రావడం, రివర్స్ టెండరింగ్ ముందుకు కదలకపోవడం వంటి కీలక అంశాలను జగన్ ఈ సమీక్షలో అధికారులతో చర్చించారు.
ఆయా సమస్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం, ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నదానిపై వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ముఖ్యంగా, న్యాయపరమైన చిక్కులు వస్తే ఏ విధంగా పరిష్కరించుకోవాలన్నదానిపైనే చర్చ సాగినట్టు తెలుస్తోంది.
మూడు రాజధానులపై బొత్స ఆసక్తికరవ్యాఖ్యలు..