*సినీ నటుడు ప్రతాప్ పోతన్ కన్నుమూత
*చెన్నైలో గుండెపోటుతో మృతి
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, ఫిల్మ్ మేకర్ ప్రతాప్ పోతన్ కన్నుముశారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది.
ప్రతాప్ పోతన్ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమాల్లో నటించారు. 100కు పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో ఆయన ‘ఆకలి రాజ్యం’, ‘కాంచనగంగ’, ‘మరో చరిత్ర’, ‘వీడెవడు’ వంటి చిత్రాల్లో నటించారు. ప్రతాప్ పోతెన్ నటుడిగా మాత్రమే కాదు పలు చిత్రాలకు డైరెక్టర్గా నిర్మాతగా కూడా ఆయన వ్యవహరించారు.
ఆయన మరణ వార్త తెలిసి తెలుగు, తమిళ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఆయన సీనియర్ నటి రాధిక మాజీ భర్త కావడం గమనార్హం. 1985లో రాధికతో వివాహం జరుగగా 1986లోనే వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు