తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ నిన్న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధికి నిధులను మంజూర్ చేయాలని కోరడంతో వెంటనే నిధులను మంజూరు చేస్తున్నట్టు కేసీఆర్ వ్యాఖ్యానించడంపై సినీ నటి మాధవీలత సంచలన కామెంట్స్ చేసింది.
ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెడుతూ, “మార్పు మొదలైంది. మోడీ గారు ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపితమయింది.. అయ్యబాబోయి, మొన్న జాతీయ జెండాలు పట్టుకున్నారు, నిన్న జనగణమన పాడేరు. నేడు గుడులు బాగుచేయాలంటున్నారు. మోడీ, నువ్వు సామాన్యుడివి కాదయ్యా… లాల్ దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నాయకడు, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును కోరారు” అని అన్నారు.
ఏపీకి వచ్చే పరిశ్రమలు తరలిపోతున్నాయి: ఎమ్మెల్సీ మాధవ్