telugu navyamedia
రాజకీయ వార్తలు

పీసీసీ పదవికి రాజీనామా చేస్తూ కంటతడి పెట్టిన సీఎం

bhupesh-baghel pcc

మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. నేడు పీసీసీ అధ్యక్ష పదవికి ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భాఘేల్ రాజీనామా చేశారు. అయితే ఆ సమయంలో ఆయన బాధను భరించలేక కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013లో తనను అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ నియమించారని వెల్లడించారు.

2014లో పార్టీ ఓడిపోతుందేమోనని కార్యకర్తలు, నేతలు భయపడ్డారని, కానీ పార్టీ అధికారంలోకి రావడంతో వారిలో మనోస్థైర్యం పెరిగిందన్నారు. తనతో పాటు ఐదేళ్లుగా కలిసి పని చేస్తున్న కార్యకర్తలకు, నేతలకు భూపేశ్ భాగేల్ ధన్యవాదాలు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా నూతన బాధ్యతలు చేపట్టనున్న మోహన్ మార్కమ్ చాలా సాధారణ జీవితాన్ని గడుపుతారని భూపేశ్ భాగేల్ ప్రశంసించారు.

Related posts