telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ముగ్గురు భామలతో అక్కినేని హీరో రొమాన్స్

Akkineni

అక్కినేని హీరో నాగ చైతన్య, విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్ లో ‘థ్యాంక్యూ’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. నాగ‌చైత‌న్యకి ఇది 20వ సినిమా కావడం విశేషం. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో చైతూ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో యూనిట్ ప్రస్తుతం హీరోయిన్లు ఎంపికలో బిజీగా ఉంది. ఇందులో ఓ కథానాయికగా ‘గ్యాంగ్‌లీడర్‌’ ఫేమ్ ప్రియాంక మోహన్‌ ఎంపిక చేసినట్లు సమాచారం. గ్యాంగ్ లీడక్ సినిమా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలోనే తెరకెక్కిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో ప్రియాంక మంచి మార్కులే కొట్టినప్పటికీ ఆ తర్వాత ఆమెకు అవకాశాలు రాలేదు. దీంతో ఆమెకు విక్రమ్ సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడన్నమాట. ఇక ఇప్పటికే ఈ చిత్రంలో రకుల్ ను ఎంపిక చేసినట్టుగా వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

Related posts